Friday, May 3, 2024

నిరుపేదలకు అండ ముఖ్యమంత్రి సహాయ నిధి – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప‌టాన్ చెరు – నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 12 లక్షల 55 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, విజయ్ కుమార్, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement