Saturday, May 4, 2024

MDK : ప్రజా సేవకుడిగా వొస్తున్నా… ఆశీర్వదించాలి… ఎంపీ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డి

నంగునూరు, ఏప్రిల్ 24(ప్ర‌భ‌న్యూస్‌): ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వొస్తున్నా.. కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షి గా ప్రమాణంగా చెబుతున్న గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి. వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్ ఆలయం నంగునూరు మండలంలోని కొనాయపల్లి శ్రీ వెంకటేశ్వరాలయంలో స్వామి వారి వద్ద నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీం కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు లతో పాటు మెదక్ పార్లమెంటు ప్రజల ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగిందన్నారు. కలెక్టర్‌గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డ నాకు రాజకీయ జీవితం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

మాట తప్పే మనిషిని కాదని, స్వామి వారి సాక్షిగా ట్రస్టు ఏర్పాటు చేసి యువతీ యువకులకు అండగా నిలుస్తామన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement