Tuesday, May 7, 2024

అనుమానాస్ప‌ద స్థితిలో వ్య‌క్తి మృతి

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కంది మండ‌లం కంది గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌ను విచారిస్తున్నారు. పురుగుల మందు డబ్బా, ద్విచక్ర వాహనం కింద పడి ఉండడంతో తనకు తనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడా? లేక ఇతర కారణాల వల్ల చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement