Tuesday, May 7, 2024

Maktal – కేంద్రంలో 25 ఏళ్లు బిజెపి పాలన – జితేందర్ రెడ్డి

మక్తల్, ఫిబ్రవరి12(ప్రభన్యూస్) కేంద్రంలో 25 ఏళ్ల పాటు బిజెపి ఫలాన కొనసాగనుందని పార్లమెంటు మాజీ సభ్యుడు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ .జితేందర్ రెడ్డి అన్నారు. మోదీ పాలనకు ముందు మోదీ పాలన తర్వాత చూసుకుంటే దేశంలో అభివృద్ధి ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి 370 స్థానాలు ఎన్డీఏ కూటమికి 400 ఎంపి స్థానాలు పక్కా రానున్నాయని అన్నారు.

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 543 ఎంపీ స్థానాలను బిజెపి 174 క్లస్టర్లుగా విభజించడం జరిగిందన్నారు. క్లస్టర్ వారిగా బస్సు యాత్రలో ఈనెల 20 నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు .ఈ బస్సు యాత్రలకు జాతీయ రాష్ట్ర నాయకులు నాయకత్వం వహించి క్లస్టర్ స్థాయిలో బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు. .20 నుండి జరగనున్న బస్సు యాత్రలో పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొని విజంతం చేయాలని జితేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement