Thursday, May 2, 2024

ఫ్రిజ్ లో కూరగాయలు పెడతారు… వీళ్ళు డెడ్ బాడీనే పెట్టేశారు

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసి ఫ్రిజ్ దాచి పెట్టారు. రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ లో ఈ దారుణ హత్య వెలుగుచూసింది. మహమ్మద్ సిద్ధికి కార్మిక నగర్ లోని ఓ భవంతిలో టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వయస్సు 35 సంవత్సరాలు. కాగా దుండగులు అతి దారుణంగా హత్య చేసి అతడి ఇంటిలో ఉన్న ఫ్రిజ్ లో దాచిపెట్టారు. ఇక సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? పాత కక్షల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement