Monday, April 29, 2024

శ్రీనివాసులుకి శ్రద్ధాంజలి..

జడ్చర్ల : బాదేపల్లి సింగిల్‌ విండో డైరెక్టర్‌ బడక శ్రీనివాసులు మృతి చెందారు. ఈ మేరకు స్థానిక ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద పిఎసిఎస్‌ చైర్మన్‌ పాలెం సుదర్శన్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌ ఫోటోకు పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం మృతుడి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ రెడ్డి , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొంగలి జంగయ్య , సిఈఓ యాదగిరి , డైరెక్టర్లు గుండప్ప జీవన్‌ , నరసింహరెడ్డి , డి.మంగమ్మ , పి. లక్ష్మమ్మ , హాథి రామ్‌ , పర్యవేక్షన మండలి సభ్యులు లక్ష్మి నరసింహా రావు , అబ్దుల్‌ అలీం , పిఎసిఎస్‌ సిబ్బంది రవి పటేల్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement