Tuesday, May 7, 2024

పార్టీ కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే జ‌నార్ధ‌న్ రెడ్డి

తాడూర్ మండలంలోని యాదిరెడ్డిపల్లి గ్రామానికీ చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు అంతటి ధనరాజ్ నిన్న సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అయన పార్థివ దేహానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేగాకుండా అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ధనరాజ్ మరణ వార్త విని షాక్ కు గురయ్యాన‌ని తెలిపారు. మంచి ఆప్తుడిని, గొప్ప మనసున్న ధనరాజ్ అన్నను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం చాలా కృషి చేశారని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement