Saturday, May 4, 2024

ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ స్వైర‌విహారం-190పందుల కాల్చివేత‌

ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ స్వైర‌విహారం చేస్తోంది. దాంతో 190పందులను చంపేసి పూడ్చి పెట్టారు.ఈ సంఘ‌ట‌న కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న రెండు పందుల ఫార్మ్స్‌లో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ కేసులు న‌మోదు అయ్యాయి. భోపాల్‌లో ఉన్న నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హై సెక్యూర్టీ యానిమ‌ల్ డిసీజెస్ సంస్థ‌లో పందుల న‌మూనాల‌ను ప‌రీక్షించారు. అయితే పందుల్లో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ సోకిన‌ట్లు నిర్ధార‌ణ కావ‌డంతో.. సుమారు 300 పందుల్ని వ‌ధించాల‌ని ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఇవాళ 190 పందుల‌ను చంపేసి.. పూడ్చి పెట్టారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని వ‌యనాడ్ జిల్లా యంత్రాంగం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement