Sunday, April 28, 2024

మన ఊరు- మనబడితో సత్ఫలాలు – ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమంతో సర్కారు బడులు కొత్త రూపు సంతరించుకుంటాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి 10వ వార్డు హైస్కూల్‌లో రూ. 28.16 లక్షల నిధులతో మౌళిక వసతుల కల్పన పనులకు ఎమ్మెల్యే దాసరి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనతోపాటు అభివృద్ధి పనులు చెపట్టడం సత్ఫలితాలనిస్తుందన్నారు.

వసతులు మెరుగు కావడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పోరేట్‌ స్థాయి విద్యనందించేందుకు సీఎం కేసీఆర్‌ కోట్లాది రూపాయలను మంజూరు చేస్తున్నారని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దాసరి మమతా రెడ్డి, కౌన్సిలర్‌ గాదె మాధవి, అగుల్ల శ్రీశైలం, రాజేశం, ఎస్‌ఎంసీ ఛైర్మెన్‌ అజ్మత్‌, శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయులు, తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement