Tuesday, March 26, 2024

సైకిల్ ప్యాలెస్ ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

ఉప్పల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి సైకిల్ ప్యాలెస్ ను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… కేసీఆర్ సీఎం అయిన తరువాత వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎలక్ట్రికల్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన సైకిల్ ను అందుబాటులోకి తేవడం మంచి ఉద్దేశ్యమన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేటర్ తూముకుంట్ల ప్రసన్న లక్ష్మీ శ్రీధర్ రెడ్డి, నిర్వాహకులు శ్యామ్ మోహన్, శివరాజ్, శశిధర్, టీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, శివారెడ్డి, బోదు కనకేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement