Thursday, May 2, 2024

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో భారీగా చేరిక‌లు..

ప్రభ న్యూస్ ప్రతినిధి, జోగులాంబ గద్వాల : గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండల కేంద్రానికి చెందిన గౌడ్ సంఘం నాయకులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు నారాయణ గౌడ్, మురళి గౌడ్, కృష్ణయ్య గౌడ్, తిమ్మప్ప గౌడ్, బీజేపీ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు ఆంజనేయులు గౌడ్, నర్సింహులు గౌడ్, తిరుమలేష్ గౌడ్, నర్సింలు గౌడ్ తిరుమల గౌడ్, మల్డకల్ గౌడ్, రాజు గౌడ్, గోవర్ధన్ గౌడ్, నర్సింహులు గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్, వీరేందర్ గౌడ్ ధర్మేష్ గౌడ్, ఓబులేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, శేషు గౌడ్, నాగన్న గౌడు, రామన్ గౌడు వెంకటేష్ గౌడ్, చిన్న నరసింహులు గౌడ్, తిప్పన్న గౌడ్, తిరుమలేష్ గౌడ్, రాజన్న గౌడ్, అశోక్ గౌడ్ వీరందరికి గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ రాజారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటన్న, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అజయ్, నరేందర్, మధు నాయకి, ప్రభాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement