Sunday, April 28, 2024

TS: జములమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు

గద్వాల (ప్రతినిధి) ఫిబ్రవరి 24 (ప్రభ న్యూస్) : శనివారం గద్వాల పట్టణంలో జమ్మి చెడు శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగా వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు. నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ జమ్ములమ్మ అమ్మ వారికి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని పవిత్రమైన కృష్ణా నీటితో 108 కలశం తో అభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు మొదటి పూజ నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది. పరుశురాముడు స్వామి దేవాలయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులు.


ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మవారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. కావున వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు నెలలపాటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నడిగడ్డ ప్రజల ఇలవేల్పు అయిన అమ్మవారి దర్శనానికి ప్రతి మంగళవారం, శుక్రవారం వేలాది మంది భక్తులు వస్తారని, నడిగడ్డ ప్రాంతంలో జమ్ములమ్మ అమ్మవారు ప్రతి ఇంటిలో ఏ శుభకార్యం జరిగిన మొదటగా అమ్మవారిని మొక్కలను చెల్లించుకుని వివాహ శుభ కార్యాలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు.

శ్రీ అమ్మవారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ, రైతులు వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గాయత్రి సతీష్, కౌన్సిలర్ శ్రీమన్నారాయణ, ఆలయ కమిటీ డైరెక్టర్స్ అభిలాష్, ఓం ప్రకాష్, ఈవో పురేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement