Wednesday, May 15, 2024

ఎక్సైజ్ కార్యాలయంలో అగ్నప్రమాదం – వాహనాలు బూడిద

మహబూబ్‌నగర్‌ : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వాహనాలు దగ్ధమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివిధ కేసులో ఎక్సైజ్‌ పోలీసులు సీజ్ చేసిన వాహనాలకు రాత్రి నిప్పంటుకుంది. చూస్తుండగానే మంటలు వ్యాపించి లారీలు, ఆటోలు, బైకులు అంటుకున్నాయి.

ఎక్సైజ్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నరు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement