Tuesday, May 14, 2024

వీరప్పయ్య స్వామి నూతన రథం

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక ఈశ్వర వీరప్పయ్య స్వామి నూతన రథోత్సవం అన్ని హంగులతో సిద్దమైంది. సుమారు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతన రథాన్ని ఏర్పాటు చేశామని దేవస్థానం చైర్మన్‌ రాధిక భాస్కర్‌ రెడ్డి , ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు. ఈ సారి కూడా ఈశ్వర్‌ వీరప్పయ్య స్వామి బ్రహ్మోత్సవాలు కోవిడ్‌ నిబంధనల ప్రకారమే నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. గ్రామస్తులు అందరూ కలిసి నూతన రథం కోసం విరాళం ఇవ్వడం జరిగిందని వారు చెప్పారు. పట్టణానికి చెందిన కమ్మరి శ్రీనివాసులు ఈ రథోత్సవాన్ని తయారు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement