Tuesday, May 7, 2024

భవన నిర్మాణం అందాల వెనుక కార్మికుల కష్టాలు..

కొత్తకోట : మున్సిపల్ పట్టణ కేంద్రంలో తాపీ మేస్త్రిల భవన కార్మికుల ఎన్నికల్లో బోల్లేద్దుల నాగరాజు అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా తెరాస మండల కార్మిక శాఖ అధ్యక్షుడు దామోదర్ యాదవ్, కొత్తకోట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మందడి జగ్గన్న.. సంద రామచంద్రయ్య పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ అధ్యక్షుడు దామోదర్ యాదవ్, మాట్లాడుతూ అందమైన భవంతిని చూసే ప్రతి ఒక్కరికీ ఆ భవంతి అందాలే కనిపిస్తాయి తప్ప దాని నిర్మాణం వెనుక భవన నిర్మాణ కార్మికుల కష్టాలు కనిపించవు. కానీ భవన నిర్మాణానికి పునాది నుండి మొదలుకొని తుదిమెరుగులు దిద్దేవరకు తాపీ మేస్త్రీల కష్టాలు అన్నీఇన్నీ కావు అని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల బతుకులు రోజు రోజుకు చితికిపోతున్నాయనీ, కార్మికులకు చేతినిండా పనులు దొరకకా పలెల్ల నుండి పట్టణాలకు వలస వెళుతున్నారనీ.. పనికోసం పట్టణాల్లోని అడ్డాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్ ఎరుకలి తిరుపతయ్య , చింతలపల్లి రవీందర్ రెడ్డి , మాజీ వార్డు మెంబర్ సుభాష్ , కృష్ణ గౌడ్ , సంద రామచంద్రయ్య , కుమ్మరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement