Monday, April 29, 2024

ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతల సహాయం..

బాలానగర్ :‌ మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా గ్రామ సర్పంచ్‌ విజయలక్ష్మి తిరుపతి ఆధ్వర్యంలో ఎల్‌ఐసి ఏజెంట్‌ రవికుమార్‌ రూ.21 వేలు ఆలయ కమిటీసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ఉత్సవాలు జరుపలేకపోతున్నామన్నారు. ఆంజనేయస్వామి ఆశీర్వాదం ప్రజలందరికి ఉంటుందని ఆలయ నిర్మాణానికి వివిధ రూపాల్లో చందాలు ఇస్తున్న వారందరి కుటుంబాలను శ్రీ అభయ ఆంజనేయ స్వామి చల్లగా చూస్తారని పేర్కొన్నారు. ఇంకా గుడి నిర్మాణానికి దాతలు విరాళం ఇవ్వాలనుకుంటే ఆలయ కమిటీ సభ్యులకు ఇవ్వవలసిందిగా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement