Monday, April 29, 2024

డప్పు కొట్టి ప్రచారం చేసిన ఎమ్మెల్యే ..

జడ్చర్ల : పట్టణ అభివృద్దికి కృషి చేస్తున్న పార్టీకి ..నాయకులకు.. ప్రజలు అండగా నిలవాలని స్థానిక ఎమ్మెల్యే డా.సి. లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు ,పాతబజార్‌ లో మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ది , సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్న టిఆర్‌ఎస్‌ కి ప్రజలు అండగా నిలవాలని కోరారు. మున్సిపాలిటీ అభివృద్దికి ఇటీవలనే దాదాపు 15 కోట్ల రూపాయలతో మున్సిపల్‌ , ఐటి శాఖ మంత్రి కేటిఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేశామని అన్నారు. ఏ కాలనీలో సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు తాను పరిష్కరిస్తూ అందరికి అందుబాటులో ఉంటానని అన్నారు. ఎన్నికల సమయంలో ఇలా వచ్చి అలా వెళ్లే నాయకులను , పార్టీలను ప్రజలు నమ్మరాదని అన్నారు. నిరంతరం ప్రజల మధ్యన పనిచేసే టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి కోరారు. అంతకు ముందు హౌసింగ్‌ బోర్డు కాలనీలో 8వ వార్డు టిఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు , 22వ వార్డు , 7వ వార్డు లలో పోటీ చేసే అభ్యర్థులతో పాటు టిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement