Friday, April 26, 2024

బ్యాంకుల ప్రైవేటీకరణ వద్దు

మహబూబ్‌నగర్‌ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని బ్యాంకులను ప్రైవేట్‌ పరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్‌ అల్వాల్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ ను నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… దేశంలో బ్యాంకులను ప్రైవేట్‌ పరం చేస్తే రైతులకు బ్యాంకు రుణాలు , సబ్సిడిలు ఇచ్చే వ్యవస్థ ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్‌ , నాయకులు భీమయ్య , మునయ్య , నాగయ్య , ఎల్లయ్య , రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement