Monday, April 29, 2024

చివరి రోజు ప్రచారం..


మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్‌, హైద్రాబాద్‌ , రంగారెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్సి అభ్యర్థి ఎల్‌. రమణ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చివరి రోజు ప్రచారం సందర్భంగా జిల్లాలో ప్రచారం నిర్వహించారు. చట్టసభల్లో నిదురపోయే నాయకుడు మనకు వద్దు అను నిత్యం పట్టభద్రుల ఎన్నికలలో ఎల్‌. రమణ కే ఓటు వేయాలని నిరుద్యోగులను , విద్యావంతులు , డాక్టర్లు , ఉపాధ్యాయులు , న్యాయవాదులను కలిసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటి నాయకులు ఆర్‌బాలప్ప , మాల్యాద్రి రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement