Thursday, May 2, 2024

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కోహ్లీలా డకౌట్ అవుతారని ట్వీట్

భారత క్రికెటర్ల తప్పిదాలను రోడ్డు ప్రమాదాల అవగాహన కోసం పోలీసులు వాడుతున్నారు. శుక్రవారం నాడు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు వాడేశారు. కోహ్లీ డకౌటై పెవిలియన్‌కి వెళ్తున్న ఫొటోని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. ‘హెల్మెట్ వేసుకుంటే సరిపోదు. పూర్తి స్పృహతో వాహనం నడపాలి. అలా డ్రైవింగ్ చేయకపోతే కోహ్లీలా మీరూ డకౌట్ అవుతారు’ అంటూ వాహనదారులను హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement