Sunday, April 28, 2024

ఓటు వేసిన తర్వాతే పెళ్ళి..

మహబూబ్‌నగర్‌ : ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా మరి కొద్దిసేపట్లో పెళ్లి ఉండగా.. తన ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచింది ఓ నవ వధువు. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఫిర్దోస్‌ బేగం పెళ్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేశారు. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో వధువు కోయిలకొండ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకుంది. ఆ తర్వాత వెంటనే  ఆ తర్వాత వెంటనే పెళ్లి కోసం ఫంక్షన్‌‌ హాలుకు బయలుదేరి వెళ్లింది. ఎన్నికల సమయంలో సెలవు ఉన్నా.. కొందరు అందుబాటులో ఉన్నా చాలా చోట్ల ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మరికొద్ది సేపట్లో తన వివాహం ఉన్నా.. బాధ్యత కలిగిన పట్టభద్రురాలిగా ఓటుహక్కు వినియోగించుకున్న ఫిర్దోస్‌ బేగంను పలువురు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement