Tuesday, March 26, 2024

నా పాత్ర అల్లుఅర్జున్ కు తెగ నచ్చేసింది…ఆమని

యంగ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో కౌశిక్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం చావు కబురు చల్లగా. మార్చి 19న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో సీనియర్ నటి ఆమని కార్తికేయ తల్లిగా నటించారు. కాగా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన ఆమని సినిమా అవుట్ పుట్ చూసిన అల్లు అర్జున్, సుకుమార్ చాలా అద్భుతంగా చేశారమ్మ …పాత్ర గుర్తుండిపోతుందని అన్నారని… వారి మాటలు విన్న నాకు అవార్డు అందుకున్నంత ఆనందాన్ని కలిగించాయని ఆమని అన్నారు.

ఎలాంటి సపోర్టు లేని తల్లి తన ఇష్టాఇష్టాలను చంపుకొని తన బిడ్డను ప్రయోజకుడిని చేయడానికి ఎంత కష్టపడింది… ఆమెను కొడుకు ఎలా అర్థం చేసుకున్నాడు..అనేది పాత్ర ఇతివృత్తం అని ఆమె అన్నారు. దర్శకుడు మొదట ఈ పాత్ర కోసం సంప్రదించినప్పుడు నేను చేయగలనా అనిపించింది. కానీ ఆ పాత్రకు సూట్ అవుతారని వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను చేయగలిగానని ఆమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement