Friday, May 3, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు

దేవరకద్ర : పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతున్నాయని తహశీల్దార్‌ జ్యోతి , ఉప తహశీల్దార్‌ శివరాజ్‌ తెలిపారు. మండల కేంద్రంలో రెండు పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఎమ్మెల్సి ఎన్నికల్లో మండలంలో ఓటర్లు 11 వందల 26 మంది ఉన్నారని అందుకుగాను రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటు వేయడానికి వస్తే ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకుని రావాలని వారు ఓటు వేసే వారిని కోరారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కూడా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఓటు వేయడానికి వచ్చే వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని వారు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి పోలింగ్‌ స్లిప్పులను పంపిణీ చేయడం జరిగిందని వారు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement