Friday, April 26, 2024

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. శశాంక తనిఖీ చేశారు. బుధవారం మరిపెడ కేంద్రంలోని టి.ఎస్.డబ్ల్యూ.ఆర్.ఎస్. జూనియర్ బాలుర కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో 386 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 359 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరు అయ్యారని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement