Friday, April 26, 2024

ఆత్మకూరు ఆస్పత్రి ఘటనపై నివేదిక కోరాం : మంత్రి రజని

ఆత్మకూరు ఆస్పత్రి ఘటనపై నివేదిక కోరామని ఏపీ మంత్రి విడదల రజని తెలిపారు. ఆత్మకూరు ఆస్పత్రి ఘటనను సర్కార్ సీరియస్ గా తీసుకుందన్నారు. సెక్యూరిటీ గార్డు, స్వీపర్ ట్రీట్ మెంట్ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో నాన్ మెడికల్ స్టాఫ్ ను చికిత్సకోసం వినియోగించొద్దని ఆదేశాలిచ్చామన్నారు. డ్యూటీ డాక్టర్, సూపరింటెండెంట్ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని డీసీహెచ్ఎస్ రమేష్ నాథ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement