Thursday, May 23, 2024

పాండు ఆశయ సాధనకు కృషిచేద్దాం : ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే వివేక్

కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహుడు, స్వర్గీయ కేఎం పాండు ఆశయ సాధన కోసం కృషి చేద్దామని ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ అన్నారు. శుక్రవారం కేఎం పాండు మూడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఇరువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి స్వర్గీయ శ్రీ కేఎం పాండు చేసిన సేవలను కొనియాడారు. విద్యాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ముందుచూపుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపట్టారని గుర్తు చేశారు. ఆపదలో ఉన్న ప్రజలకు పాండు అండగా నిలిచి వారికి చేయూతనందించి ప్రజల ఆదరాభిమానాలు పొందిన గొప్ప రాజకీయ నాయకుడని కొనియాడారు. పాండు బాటలో ప్రతి ఒక్కరూ ప‌య‌నించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్, బొడ్డు వెంకటేశ్వర రావు, సురేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరామ్, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, విజయ్ రామ్ రెడ్డి, రుద్ర అశోక్, శంకరయ్య, పోలె శ్రీకాంత్, నిజాంపేట్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ ఆగం పాండు, కోఆప్షన్ సభ్యుడు తలారి వీరేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, సయ్యద్ రషీద్, సోమేష్ యాదవ్, దేవేందర్ యాదవ్, వేణు యాదవ్, కమలాకర్, గుమ్మడి మధుసూధన్ రాజు, సత్తి రెడ్డి, వెంకటస్వామి, నాగరాజ్ యాదవ్, మహిళా నాయకురాలు ఇందిరా రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement