Thursday, May 2, 2024

మండ‌లి చైర్మ‌న్ నూత‌న ఛాంబ‌ర్.. పూజలు చేసిన గుత్తా 

తెలంగాణ శాసన మండలిలో నూతన ఛాంబర్‌ను చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నూత‌న ఛాంబ‌ర్‌లో చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం చైర్మ‌న్ సుఖేంద‌ర్ రెడ్డిని మిగ‌తా ఎమ్మెల్సీలు కుర్చీలో కూర్చోబెట్టారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్ట‌ర్ నరసింహా చార్యులు, నల్గొండ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement