Friday, April 26, 2024

ఆసుపత్రిలో రెబల్ స్టార్.. కుటుంబసభ్యుల కీలక ప్రకటన

సీనియ‌ర్ న‌టుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆస్పత్రిలో చేరారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కృష్ణంరాజు ఆరోగ్యం బాగోలేదని, హైదరాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నార‌ని వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కృష్ణంరాజు ఆరోగ్యం బాగుందని అందులో స్ప‌ష్టం చేశారు.

యూకే ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న నేప‌థ్యంలో కృష్ణంరాజు సాధార‌ణ‌ ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ని, వైద్య ప‌రీక్ష‌ల కోస‌మే ఆసుప‌త్రికి వెళ్లామ‌ని వెల్లడించారు. ఇటీవల బైక్ యాక్సిడెంట్‌లో గాయపడి చికిత్స తీసుకుంటున్న సాయితేజ్ ఆరోగ్య ప‌రిస్థితిని కూడా కృష్ణంరాజు తెలుసుకున్నారని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కృష్ణంరాజు ఆకాంక్షించారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement