Friday, April 19, 2024

తెలంగాణ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిటిషన్

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై ఆ పార్టీ మరో ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతుండగానే పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టేసిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. వారి బెయిల్ రద్దు పిటిషన్‌ను మరో కోర్టుకు బదలాయించాలని కోరుతూ ఆయన హైకోర్టు మెట్లెక్కారు.

జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయాలంటూ రఘు రామ వేసిన పిటిషన్ విచారణను ఇటీవలే పూర్తి చేసిన సీబీఐ కోర్టు.. రేపు తదుపరి ఆదేశాలను ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే రేపు సీబీఐ కోర్టు ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసును హైదరాబాద్, తెలంగాణలోని ఇతర క్రిమినల్ కోర్టులకు బదిలీ చేయాలని కోరారు. పిటిషన్ ను అత్యవసర విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఆ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement