Friday, April 26, 2024

ప్రివిలేజ్ కమిటీ విచార‌ణ‌కు హాజ‌రైన‌ అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేనిపై టీడీపీ నేత‌ అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై మంగళవారం ప్రివిలేజ్ కమిటీ విచార‌ణ జ‌రిపింది. ఆ క‌మిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధ‌న్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన భేటీకి అచ్చెన్నాయుడు హాజ‌ర‌య్యారు. ఇటీవ‌లే అచ్చెన్నాయుడికి నోటీసులు అంద‌డంతో ఆయ‌న ఈ విచార‌ణ‌లో పాల్గొన్నారు.

కాగా, గత నెలలో జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు హాజ‌రుకాలేదు. దీంతో కమిటీ ఈ రోజు మ‌రోసారి స‌మావేశం కావ‌డంతో ఆయ‌న హాజ‌రయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement