Monday, April 29, 2024

కోట మైసమ్మ విగ్రహ ప్రతిష్ట.. పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి సతీమణి

పెద్దమందడి (ప్రభ న్యూస్)- మండల పరిధిలోని అల్వాల గ్రామంలో శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మూడో రోజున తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి పాల్గొన్నారు.. విగ్ర ప్రతిష్ట కార్యక్రమంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా జిల్లా రైతుబంధు అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజ కార్యక్రమానికి 50, వేల రూపాయలు నగదు ఆర్థిక సాయం చేసినట్లు స్థానిక సర్పంచ్ సువర్ణ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వారితోపాటు సింగల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి. పెద్ద వెంకటరెడ్డి. చిన్న వెంకటరెడ్డి. మాజీ సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి. లక్ష్మీకాంతారెడ్డి. ఉప సర్పంచ్ సుదర్శన్ రెడ్డి. రామచంద్రారెడ్డి. శేఖర్ రెడ్డి. బాల్ రెడ్డి. తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement