Thursday, April 25, 2024

నంద్యాల జిల్లాలో ప‌రువు హ‌త్య – తండ్రి చేతిలో కుమార్తె హ‌తం..

నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డికి ప్రసన్న, ప్రవళిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రసన్న కు రెండేళ్ల క్రితం బనగానపల్లె మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడంతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. కాగా, పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించిన ప్రసన్న.. కొద్దిరోజుల క్రితం అతడితో కలిసి పారిపోయింది. గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో పంచాయితీ చేసి ఇద్దరినీ విడదీశారు.
అనంత‌రం భర్త దగ్గరికి వెళ్లాలని తండ్రి వేడుకున్నా… ప్రసన్న స్పందించడం లేదు. ఈ క్రమంలో కూతురు వ్యవహారాన్ని అవమానంగా భావించిన దేవేందర్ రెడ్డి.. ఈనెల 10వ తేదీన ప్రసన్నను గొంతు నులిమి చంపాడు. అనంతరం కొంతమందితో కలిసి మృతదేహాన్ని కారులో నంద్యాల -గిద్దలూరు రహదారిలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాతీసుకెళ్లాడు. అక్కడ ప్రసన్న తల, మొండెం వేరు చేసి వేర్వేరుగా లోయల్లో పడేశాడు. తర్వాత ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లు ఉన్నాడు.


రెండు వారాలైనా మనవరాలు ఫోన్ చేయకపోవడంతో దేవేందర్ రెడ్డి తండ్రి శివారెడ్డి అనుమానించాడు. కొడుకుని పదేపదే అడిగాడు. చివరికి గట్టిగా నిలదీయడంతో కూతురును చంపిన విషయం దేవేందర్ రెడ్డి బయటకు చెప్పాడు. ఆ విషయాన్ని తట్టుకోలేని శివారెడ్డి పాణ్యం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దేవేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రెండ్రోజుల పాటు లోయలో గాలించి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ప్రసన్న మృతదేహాన్ని, తలను గుర్తించారు. శవపరీక్ష కోసం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శివారెడ్డి ఫిర్యాదు మేరకు దేవేందర్ రెడ్డి తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి వివరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement