Thursday, May 2, 2024

WGL: మహిళపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు..

పాతకక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తి.. ఓ మహిళ గొంతు కోసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురం లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంబాబు, అర్జున్ ల మధ్య ట్రాక్టర్ విషయంలో సంవత్సరం క్రితం ఘర్షణ కాగా, బయ్యారం పోలీస్ స్టేషన్ లో రాంబాబుపై కేసు నమోదయింది. పాత కక్ష్యలను మనసులో పెట్టుకున్న రాంబాబు అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి పొలం పనులకు వెళ్తున్న గుండెల. అర్జున్ కు చెందిన ట్రాక్టర్ కు అడ్డుపడి ఇబ్బందులకు గురి చేశాడు.

దీంతో సమాచారం అందుకున్న అర్జున్ అక్కడికి వెళ్ళి అతన్ని పక్కకు నెట్టి వేసి ట్రాక్టర్ ను తీసుకెళ్ళాడు. అర్జన్ ను వెంబడించిన రాంబాబు ఇంటికెళ్ళి చూడగా అర్జున్ లేకపోవడం, తన కళ్ళ ఎదుటే అర్జున్ తల్లి కలమ్మ ఉండటంతో కోపంతో మటన్ కొట్టే కత్తితో మెడపై కోసి పరారయ్యాడు. కింద పడిపోయిన కలమ్మను హుటాహుటిన మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రాణాపాయం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement