Friday, May 10, 2024

బీజేపీ నేతల అరెస్ట్‌లపై కిషన్ రెడ్డి మండిపాటు – ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది అంటూ వ్యాఖ్య

హైదరాబాద్ – బీజేపీ నేతల అక్రమ అరెస్ట్‌లను తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఖండించారు. ఈ క్రమంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ” హౌస్‌ అరెస్ట్‌లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే బీఆర్‌ఎస్‌కు ఉలికిపాటెందుకు?. ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగబాటా?. కేవలం ఇళ్లు చూడటానికి వెళ్తుంటే భయమెందుకు?. బీఆర్‌ఎస్‌ను గద్దె దింపేవరకు ఉద్యమం ఆగదు. గొప్పగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తే అక్రమ అరెస్ట్‌లు ఎందుకు?. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement