హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ, పలువు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.
ఇక, ఛలో బాట సింగారం నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక, బీజేపీ ఆఫీసు ముందు రెండు ప్లాటూన్స్తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
.