Tuesday, May 7, 2024

Khanapur – ఎన్నికల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలి – రాథోడ్ రమేష్

ఉట్నూర్ నవంబర్ 16( ప్రభ న్యూస్) ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని ఖానాపూర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాథోడ్ రమేష్ అన్నారు. ఆయన గురువారం మండలంలోని కొమ్ముగూడ పెరక గూడా హస్నాపూర్ తదితర గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనని ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని అన్నారు

. ఈ కార్యక్రమాల్లో బిజెపి పార్టీ అధ్యక్షులు కొలిపాక రాజశేఖర్ బిజెపి జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రా0చందర్, జిల్లా నాయకులు నాయకులు, సాడిగే రాజేశ్వర్, శ్రీపతి లింగ గౌడ్ ఉష్కమల్ల దేవిదాస్,మండల ,నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement