Monday, May 6, 2024

Asifabad – మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ను బొంద పెట్టాలి – కోవలక్ష్మి

జైనూర్ / సిర్పూర్ (యు)నవంబర్ 16 (ప్రభ న్యూస్) కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టాలని అసిఫాబాద్ నియోజక వర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి అన్నారు. ఆమె గురువారం సిర్పూర్( యు) మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఆయా గ్రామాల్లో కోవలక్ష్మికి ఆదివాసి మహిళలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోవలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత 10ఏళ్లలో అన్ని వర్గాల అభివృద్ధి తో పాటు అనేక సంక్షేమాలు అమలు చేశారని ప్రజలు ఈ పథకాలను గుర్తించాలని ఆమె కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తులసమ్ ధర్మారావు జై నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతురావు సిర్పూర్ యు ఎంపిపి తొడసం భాగ్యలక్ష్మి, జెడ్పిటిసి కోవా అరుణ, వైస్ ఎంపీపీ ఆత్ర0 ప్రకాష్, లింగాపూర్ జెడ్ పి టి సి ఆడేరుక్య లక్య నాయక్, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement