Thursday, May 2, 2024

Bhadrachalam: బీజేపీకి షాక్… ఎంపీపీ సతీష్ రాజీనామా

భద్రాచలం (టౌన్), నవంబర్ 11 (ఆంధ్రప్రభ) : భద్రాచలం బిజెపి పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆపార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, వెంకటాపురం ఎంపీపీ చెరుకూరి సతీష్ బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి హఠాత్ మరణంతో భద్రాచలం టికెట్ ఇస్తారని భావించిన చెరుకూరి సతీష్ సత్యవతి హఠాత్ మరణంతో బీజేపీ అధిష్టానం భద్రాచలం టికెట్ ఆమె భర్త కుంజ ధర్మారావుకు కేటాయించారు.

దీంతో చెరుకూరు సతీష్ మనస్థాపానికి గురయ్యారు. నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి, అదేవిధంగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి బీజేపీ పార్టీ అభివృద్ధికి పాటుపడిన తనకు టికెట్ ఇవ్వకుండా…. పార్టీలో ఎటువంటి పనిచేయని వ్యక్తికి, కనీసం ఓటు బ్యాంకు లేని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ తన రాజీనామా లేఖలో తెలిపారు. అదేవిధంగా పార్టీలో తనను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తూ చెరుకూరి సతీష్ రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement