Friday, May 10, 2024

రాజన్న సంక్షేమ పాలన కోసమే ముందుకొచ్చా..

ఖమ్మం : జిల్లా అభిమానులతో వైఎస్ షర్మిల సమావేశం ముగిసింది. చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ జరగాలని షర్మిల అన్నారు. పార్టీ విధివిధానాలపై ఖమ్మం సభలోనే ప్రకటిస్తామని చెప్పారు. వైఎస్‌కు రెండు ప్రాంతాలు.. రెండు కళ్లలా ఉండేవి అని షర్మిల తెలిపారు. రాజన్న సంక్షేమ పాలన కోసమే ముందుకొచ్చానని షర్మిల చెప్పారు. షర్మిలమ్మ రాజ్యం కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని షర్మిల వెల్లడించారు. దొరల కుటుంబ పరిపాలన పోవాలని, రాజన్న పాలన రావాలని అభిమానులతో జరిగిన సమావేశంలో వైఎస్ షర్మిల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement