Monday, April 29, 2024

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం : ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్ పాయ్

ఖమ్మం రూరల్ : తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని, అందుకే ప్రతి నియోజక వర్గంలో సీనియర్ నేతలు జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌ని ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎంపీ లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ అన్నారు. బీజేపీ పాలేరు నియోజకవర్గ మీడియా సమావేశం గురువారం పెద్ద తండా గ్రామ పంచాయతీలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో నేరుగా పోరాటం చేస్తున్నామ‌ని, ప్రతి నియోజకవర్గంలోని బీజేపీ అనుబంధ సంఘాలతో అభిప్రాయాలను సేకరిస్తున్నామ‌న్నారు.

కాంగ్రెస్ – టీఆర్ ఎస్ రెండూ ఒక్కటే అని, రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్ధిని కూడా నిలబెట్టాయ‌న్నారు. తెలంగాణలొ అధికార పార్టీ పై ప్రజలకు నమ్మకం పోయింద‌న్నారు. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులలో బలపడద‌ని, టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలు అమలు జరగలేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement