Wednesday, May 8, 2024

సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై పవన్ కల్యాణ్ ధిగ్భ్రాంతి

శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూలీలు మృత్యువాత పడిన ఘటన అత్యంత విచారకరమన్నారు. విద్యుత్‌ తీగ తెగిపడడం మానవ తప్పిదమా ? నిర్వహణ లోపమా అని పవన్‌ కల్యాణ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచడంపై చూపించే శ్రద్ధ విద్యుత్‌ లైన్ల నిర్వహణపై చూపాలని సూచించారు. చాలాచోట్ల విద్యుత్‌ స్తంభాలు ఒరిగి, వేలాడుతున్నా.. పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement