Sunday, May 19, 2024

KHM: కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పోదెం వీరయ్య

భద్రాచలం (టౌన్), నవంబర్ 9 (ఆంధ్ర ప్రభ): పట్టణంలో భద్రాచలం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పొదెం వీరయ్య నామినేషన్ దాఖలు చేశారు. మొదట భద్రాద్రి రామయ్య ను దర్శించుకున్నారు. అనంతరం కార్యకర్తలు నడుమ ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మంగిలాల్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బుడగం శ్రీనివాస్, టిడిపి డివిజన్ నాయకులు కుంచాల రాజారామ్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement