Sunday, May 5, 2024

Khammam : ఒకే చోట రెండు ప్రైవేటు బస్సులు బోల్తా.. పలువురికి గాయాలు

ఖమ్మం : సూర్యాపేట జాతీయ హైవేపై ఆదివారం తెల్లవారుజామున రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఒకే చోట వేరు వేరుగా బోల్తా పడటంతో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాదు నుండి రాజమండ్రి కి వెళ్తున్న కె.వి.ఆర్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు, హైదరాబాదు నుండి తిరువూరు వెళ్తున్న మరో శ్రీ కె.వి.ఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నాయకన్ గూడెం వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డా యి. అర్థగంట వ్యవధిలో వేరువేరుగా ఒకే చోట జరిగిన ఈ రెండు బస్సుల ప్రమాదాల్లో బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు కావడంతో రెస్ క్యూ టీం అక్కడకు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, జాతీయ హైవే అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలు విచారిస్తున్నారు.

హైవే నిర్మాణంలో లోపమే కారణం..

ఖమ్మం సూర్యాపేట జాతీయ హైవే రోడ్డు నిర్మాణంలో లోపాల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. బస్సుల ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిన్న ఒక లారీ బోల్తా పడింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు వాహనదారులు పేర్కొంటున్నారు. హైవే నిర్మాణంలో ఉన్న లోపాన్ని సరిచేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement