Sunday, April 28, 2024

Big Breaking | రిటైర్డ్ ఎంపీడీవోని చంపేశారు.. భూ వివాదమే కారణం

వరంగల్ క్రైమ్‌, (ప్రభ న్యూస్) : రెండ్రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన రిటైర్డ్ ఎంపీడీవో శ‌వ‌మై తేలాడు. పోలీసులు అనుమానించిన‌ట్టుగానే అత‌ని మృత‌దేహం బ‌య‌ట‌ప‌డింది. అయితే.. అత‌ని మ‌ర్డ‌ర్‌కి భూ వివాహదం కార‌ణంగా తెలుస్తోంది. ఈ విషయంలో రిటైర్డ్ ఎం పి డి ఓ రామకృష్ణయ్యను మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. ఆదివారం ఉదయం జనగామలోని చంపక్ హిల్స్ శివారులో అత‌ని మృతదేహం లభ్యమైంది. సుఫారీ గ్యాంగే కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

భూమి విషయంలో రిటైర్డ్ ఎం పి డి ఓ రామకృష్ణయ్య ఆర్ టి ఏ చట్ట ప్రకారం వివరాలు కోరారు. ఆ విషయంలోనే సుఫారీ గ్యాంగ్ చే మర్డర్ చేయించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎవరు హత్య చేశారు. ఎందుకు చేశారు. మర్డర్ విషయంలో ఎవ్వరేవ్వరి హస్తం ఉందొ తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

మూడు రోజుల క్రితం బచ్చన్నపేట నుండి పొచ్చన్నపేట వెళుతుండగా రిటైర్డ్ ఎం పి డి ఓ రామకృష్ణయ్య ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు వెతుకుతున్న తరుణంలో ఆదివారం జనగామ పట్టణంలోని చంపక్ హిల్స్ శివారులో కుంటలో రామకృష్ణయ్య మృతదేహం లభ్యమైంది. కిడ్నాప్ , మర్డర్ మిస్టరీని ఛేజించే పనిలో పోలీసులు పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement