Sunday, May 5, 2024

లైంగిక వేధింపులకు గురైన మహిళలకు.. అండగా భ‌రోసా కేంద్రం : పోలీస్ కమిషనర్

లైంగిక వేధింపులకు గురైన మహిళలకు అండగా నిలిచి… వారిలో మనో ధైర్యాన్ని నింపి కొత్త జీవితం ప్రారంభించేలా భరోసా కేంద్రం సాయపడుతోందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో మరమ్మత్తులు చేసిన భరోసా కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… హింసకు గురైన మహిళ ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండా అన్ని సేవలందిస్తూ వారికి అవసరమైన కౌన్సిలింగ్, వైద్యం సదుపాయం, న్యాయ సహాయం, పోలీస్ సహాయంతో భరోసాను కల్పిస్తున్నారన్నారు. మహిళలకు ఎదురయ్యే అన్ని రకాల సమస్యల నుంచి బయట పడేలా వచ్చిన బాధితురాలికి మేమున్నాం అనే భరోసా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ గౌష్ అలమ్, సుభాష్ చంద్ర బోస్, ఏసీపీ అంజనేయులు, సిఐలు అంజలి, చిట్టిబాబు, శ్రీధర్, ఆర్ఐ రవి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement