Sunday, April 28, 2024

TS: మేడిగడ్డ ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజీ ఘటన పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మేడిగడ్డ ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని ప్రాజెక్టు అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ బహిరంగ సభకు వెళ్తున్నారు కానీ అసెంబ్లీకి రావడం లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

సీఎంగా ఉన్నప్పుడు సైతం సచివాలయానికి రాలేదని.. కానీ బహిరంగ సభకు ఎలా వెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై కేంద్రం అథారిటీ తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ డ్యామ్‌పైకి ఏపీ ప్రభుత్వం పోలీసులను పెట్టి డ్యామ్ గేట్లు తెరిచి నీళ్లు తీసుకెళ్తుంటే కేసీఆర్ సర్కారు ఏం చేసింది ? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement