Sunday, April 28, 2024

TS: బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం : ఎంపీ బాపురావు

తాంసి, ఫిబ్రవరి 13 (ప్రభ న్యూస్) : ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో ఐదు లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

అంతకు ముందు ఈనెల 14న అయోధ్యలోని రాముని దర్శనానికి వెళ్లనున్న పలువురిని శాలువాతో సన్మానించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement