Sunday, May 19, 2024

రైతు బాంధవుడు కేసీఆర్ : ఎమ్మెల్యే దాసరి

దేశంలో ఏ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోలేదని, రైతులకు పెట్టుబడి ఇచ్చి రాజును చేస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆని, జన్మంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం అప్పన్నపేటలో రైతుబంధు ఉత్సవాలు నిర్వహించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ చీకటి స్వరూప, ఎంపీటీసీ తోట నర్సమ్మ-శ్రీనివాస్, వైస్ ఛైర్మెన్ సంపత్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఛైర్మెన్ ముద్దసాని రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు విజయ రావు, డైరెక్టర్ దుర్గయ్య, తెరాస నాయకులు రాపెల్లి శ్రీనివాస్, నీలి శ్రీనివాస్, మామిడి మల్లయ్య, సంజీవ్, రామ్ -లక్ష్మణ్, రాజేశం, చిరంజీవి, శివ, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement