Monday, May 6, 2024

Kurnool: జడ్పీ చైర్మన్ గా ఎన్నికైన ఎర్రబోతుల పాపిరెడ్డి

కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎర్రబోతుల పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు జిల్లా ప్రజా పరిషత్ సభ భవనంలో ప్రత్యేక సమావేశంలో  జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్ర నాథ్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కె శ్రీదేవి , జడ్పీటీసీ సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు హాజరైయ్యారు.

జడ్పీ చైర్మన్ గా ఎర్రబోతుల పాపిరెడ్డి పేరును మహానంది జడ్పిటిసి సభ్యుడు కె ఆర్ మహేశ్వర్ రెడ్డి ప్రతిపాదించగా, మిడ్తూరు జడ్పీటీసీ సభ్యుడు పి.యుగంధర్ రెడ్డి, వెల్దుర్తి జడ్పిటిసి సుంకన్నలు బలపర్చారు. దీంతో జడ్పీ చైర్మన్ గా ఎర్రబోతుల పాపిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ప్రకటించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిచే ప్రమాణ స్వీకారం చేయించి, ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.

కాగా, కొలిమిగుండ్ల నుంచి జడ్పిటిసి గా ఏకగ్రీవం అయిన ఎర్రబోతుల వెంకటరెడ్డి… ఆ తర్వాత కరోనాతో మృతిచెందారు. కొలిమిగుండ్ల ఉప ఎన్నికలలో ఎర్రబోతుల వెంకటరెడ్డి కుటుంబం నుంచి జెడ్పీటీసీగా ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారుడు పాపిరెడ్డి ఏకగ్రీవంగా అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement