Tuesday, May 14, 2024

Tributes – గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఘన నివాళి..

హైద‌రాబాద్ : ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి వెళ్లిన కేసీఆర్ గద్ద‌ర్ భౌతిక‌కాయంపై పుష్ఫం గుచ్చం ఉంచి నివాళుల‌ర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్దాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.

సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, చంటి క్రాంతి కిర‌ణ్‌, మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న‌, బీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement